Telangana: తెలంగాణలో మరో 2,484 కరోనా పాజిటివ్ కేసులు

Telangana corona bulletin

  • గత 24 గంటల్లో 65,263 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 1,045 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 38,723 మందికి చికిత్స

తెలంగాణలో కరోనా వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 65,263 కరోనా పరీక్షలు చేయగా... 2,484 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,045 కొత్త కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 138, రంగారెడ్డి జిల్లాలో 130, నల్గొండ జిల్లాలో 108, ఖమ్మం జిల్లాలో 107 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 4,207 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,61,050 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,18,241 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 38,723 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,086కి పెరిగింది.

Telangana
Corona Virus
Bulletin
Update
Today Cases
  • Loading...

More Telugu News