Ramcharan: చెల్లి శ్రీజతో క‌లిసి ముంబైలో రామ్ చ‌ర‌ణ్‌.. ఫొటోలు వైర‌ల్

ram charan in mumbai

  • విమానంలో ఫొటోలు
  • ఎయిర్ పోర్టు ఆవ‌ర‌ణ‌లోనూ
  • షూటింగుల‌కు విశ్రాంతి దొర‌క‌డంతో ముంబైకి? 

సినీ న‌టుడు రామ్ చ‌ర‌ణ్ తేజ్ ముంబైలో త‌న చెల్లి శ్రీజతో క‌లిసి దిగిన ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. త‌మ‌ పెంపుడు కుక్క రైమ్ ను కూడా వారు త‌మ‌తో పాటే తీసుకెళ్లారు. విమానంలో ఎయిర్ పోర్టు ఆవ‌ర‌ణ‌లో వారు ఫొటోలు దిగారు. శ్రీజతో కలిసి చెర్రీ ముంబైకి ఎందుకు వెళ్లాడన్న విష‌యంపై వివ‌రాలు తెలియ‌రాలేదు.
               
రామ్ చరణ్ న‌టించిన ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మైన విష‌యం తెలిసిందే. కరోనా విజృంభణ నేప‌థ్యంలో ఆ రెండు సినిమాలు వాయిదా ప‌డ్డాయి. క‌రోనా త‌గ్గు ముఖం ప‌ట్టాక ఈ సినిమాల‌ను విడుద‌ల చేయాల‌ని ఆ సినిమా యూనిట్లు భావిస్తున్నాయి. ఇప్ప‌టికే విడుద‌ల‌కు సంబంధించి కొత్త తేదీల‌ను కూడా విడుద‌ల చేశాయి. షూటింగుల‌కు విశ్రాంతి దొర‌క‌డంతో రామ్ చ‌ర‌ణ్ ముంబై వెళ్లిన‌ట్లు తెలుస్తోంది.

               

  • Loading...

More Telugu News