Telangana: తెలంగాణలో తాజాగా 3,590 కరోనా కేసుల నమోదు

Telangana corona cases

  • గత 24 గంటల్లో 95,355 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 1,160 కేసులు
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 40,447 మందికి చికిత్స

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 95,355 కరోనా పరీక్షలు నిర్వహించగా... 3,590 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ లో 1,160 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 257, రంగారెడ్డి జిల్లాలో 215, హనుమకొండ జిల్లాలో 132, ఖమ్మం జిల్లాలో 121 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 3,555 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,58,566 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,14,034 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 40,447 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,085కి పెరిగింది.

Telangana
Corona Virus
Daily Report
Today Cases
  • Loading...

More Telugu News