ఉస్మానియా వర్సిటీలో క్రికెట్ టోర్నీ నిర్వహించడానికి సిగ్గుండాలి: టీఆర్ఎస్ పై కోమటిరెడ్డి వ్యాఖ్యలు
- కేసీఆర్ పేరుమీద టోర్నమెంట్
- మండిపడిన కోమటిరెడ్డి
- ఓవైపు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారని వ్యాఖ్య
కాగా, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఆత్మహత్యకు పాల్పడిన నిరుద్యోగి ముత్యాల సాగర్ కుటుంబాన్ని నిన్న పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరుద్యోగులు ఎవరూ తొందరపడి బలవన్మరణాలకు పాల్పడవద్దని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. "రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి... ఇది నీకు న్యాయమేనా? నీకు కూడా బిడ్డలు ఉన్నారు... నిరుద్యోగుల గురించి ఒక్కసారి ఆలోచించాలి" అని హితవు పలికారు.