Sensex: భారీ లాభాల్లోకి వెళ్లి.. చివర్లో నష్టాలలో ముగిసిన మార్కెట్లు

Markets ends in losses

  • 76 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 8 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 3 శాతం వరకు నష్టపోయిన మారుతి సుజుకి షేర్ విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాల్లో ముగించాయి. అంతర్జాతీయంగా సానుకూలతలు ఉండటంతో పాటు ఏసియన్ మార్కెట్లన్నీ రికవరీలో ఉండటంతో... మన మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. లాభాల్లోనే కొనసాగాయి.

అయితే ఇన్వెస్టర్లు చివర్లో లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో చివరకు నష్టాల్లో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 76 పాయింట్లు నష్టపోయి 57,200కి పడిపోయింది. నిఫ్టీ 8 పాయింట్లు కోల్పోయి 17,101 వద్ద స్థిరపడింది.
 
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (3.89%), సన్ ఫార్మా (1.85%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.72%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.38%), విప్రో (1.37%).

టాప్ లూజర్స్:
మారుతి సుజుకి (-2.99%), టెక్ మహీంద్రా (-2.43%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-2.14%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.62%), యాక్సిస్ బ్యాంక్ (-1.08%).

  • Loading...

More Telugu News