Corona Virus: దేశంలో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌

corona bulletin in inida

  • కొత్త‌గా 2,86,384 క‌రోనా కేసులు
  • 573 మంది మృతి
  • 22,02,472 యాక్టివ్ కేసులు
  • మృతుల సంఖ్య‌ మొత్తం 4,91,700  

దేశంలో క‌రోనా ఉద్ధృతి కొన‌సాగుతోంది. నిన్న 2,86,384 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో తెలిపింది. అలాగే నిన్న 573 మంది ప్రాణాలు కోల్పోయార‌ని పేర్కొంది. నిన్న క‌రోనా నుంచి 3,06,357 మంది కోలుకున్న‌ట్లు వివ‌రించింది.  

ఇక ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 22,02,472 మందికి చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,63,84,39,207 డోసుల వ్యాక్సిన్లు వేశారు. దేశంలో క‌రోనాతో మొత్తం 4,91,700 మంది మృతి చెందారు. మొత్తం 72,21,66,248 క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు.

  • Loading...

More Telugu News