Telangana: తెలంగాణలో మరో 3,603 మందికి కరోనా పాజిటివ్

Telangana Covid daily update

  • గత 24 గంటల్లో 93,397 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 1,421 కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 32,094 మందికి చికిత్స

తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 93,397 శాంపిల్స్ పరీక్షించగా 3,603 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 1,421 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 308, రంగారెడ్డి జిల్లాలో 262, హనుమకొండ జిల్లాలో 150 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 2,707 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,34,815 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,98,649 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 32,094 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,072కి పెరిగింది.

Telangana
COVID19
Daily Update
Today Cases
  • Loading...

More Telugu News