rain: తెలంగాణ‌లో వ‌ర్షాలు.. సూర్యాపేటలో స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి ఆదేశం

rains in telangana

  • సూర్యాపేట జిల్లాలో అత్యధిక వర్షపాతం
  • అక్క‌డి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జ‌గ‌దీశ్‌ రెడ్డి విజ్ఞ‌ప్తి
  • కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో స‌మీక్ష‌

హైద‌రాబాద్ స‌హా తెలంగాణలోని ప‌లు జిల్లాల్లో గ‌త రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ప్ర‌ధానంగా సూర్యాపేట జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైందని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం వరకు వర్షం ప‌డింది. ఆ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. ఎర్కకారంలో అత్యధికంగా 14.5 సెంటీమీట‌ర్ల వర్షం కురిసింది.

సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాల నేప‌థ్యంలో అక్క‌డి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి జగదీశ్‌ రెడ్డి కోరారు. ఆ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో పాటు మునిసిపల్ కమిషనర్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో జ‌గ‌దీశ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. లోత‌ట్టు ప్రాంతాల్లో వెంటనే స‌హాయ‌క‌ చర్యలు చేపట్టాలని ఆయన చెప్పారు. స‌హాయ‌క సిబ్బందికి ప్రజలు సహకరించాలన్నారు.

rain
Hyderabad
Suryapet District
Telangana
  • Loading...

More Telugu News