Andhra Pradesh: ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!

Andhra Pradesh records 4528 Corona cases
  • 24 గంటల్లో 4,528 మందికి కరోనా పాజిటివ్
  • చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1,027 కేసులు
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 18,313
ఏపీలో కరోనా వైరస్ మళ్లీ ప్రభావం చూపిస్తోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 4,528 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1,027 కేసులు నమోదు కాగా... పశ్చిమగోదావరి జిల్లాలో అత్యల్పంగా 62 కేసులు కేసులు నమోదయ్యాయి.

ఇక ఇదే సమయంలో 418 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రకాశం జిల్లాలో ఒకరు మృతి చెందారు. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 20,96,755కి పెరిగింది. వీరిలో 20,63,934 మంది కోలుకున్నారు. మొత్తం 14,508 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,313 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Andhra Pradesh
Corona Virus
Updates

More Telugu News