Sensex: మార్కెట్లలో ఈరోజు కూడా కొనసాగిన బుల్ జోరు

Markets ends for straight fourth day

  • 533 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 157 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 4.68 శాతం లాభపడ్డ ఎం అండ్ ఎం షేర్ విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు నేడు కూడా లాభాల్లో కొనసాగాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచాయి. దీంతో ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 533 పాయింట్లు లాభపడి 61,150కి పెరిగింది. నిఫ్టీ 157 పాయింట్లు పుంజుకుని 18,212 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (4.68%), భారతి ఎయిర్ టెల్ (3.76%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (2.68%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.58%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.68%).

టాప్ లూజర్స్:
టీసీఎస్ (-1.50%), టైటాన్ (-1.46%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.58%), టెక్ మహీంద్రా (-0.55%), విప్రో (-0.40%).

  • Loading...

More Telugu News