Chandrababu: 'చైతన్యరథం'... టీడీపీ ఈ-పేపర్ ను ప్రారంభించిన చంద్రబాబు

Chandrababu launches TDP ePaper

  • పార్టీ శ్రేణుల కోసం టీడీపీ ఈ-పేపర్
  • చైతన్యరథంగా నామకరణం
  • అమరావతి ఎన్టీఆర్ భవన్ లో ప్రారంభోత్సవం 
  • ఒక్క క్లిక్ తో 30 లక్షల మందికి ఈ-పేపర్

టీడీపీ సరికొత్తగా 'చైతన్యరథం' పేరిట ఈ-పేపర్ తీసుకువస్తోంది. అమరావతి ఎన్టీఆర్ భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ-పేపర్ ను ఆవిష్కరించారు. వెబ్, ఫోన్ల ద్వారా ఈ ఈ-పేపర్ ను వీక్షించవచ్చు. ఈ కార్యక్రమంలో పార్టీ అగ్రనేతలు పలువురు పాల్గొన్నారు.

ఈ-పేపర్ ప్రారంభోత్సవం అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరినీ చైతన్యపరిచే ఆయుధమే 'చైతన్యరథం' అని పేర్కొన్నారు. తమకు వ్యతిరేకంగా ఎవరూ వార్తలు రాయకూడదన్నట్టు జగన్ సర్కారు వ్యవహరిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.

లక్షల మంది పార్టీ కార్యకర్తలకు సమాచార వారధిలా 'చైతన్యరథం' ఈ-పేపర్ పనిచేస్తుందని అన్నారు. ఒక్క క్లిక్ తో 30 లక్షల మందికి ఈ-పేపర్ వెళ్లిందని వివరించారు.

  • Loading...

More Telugu News