Sensex: ఒమిక్రాన్ గురించి పెద్దగా ఆందోళన చెందని ఇన్వెస్టర్లు.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు!

Markets ends in profits

  • 221 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 52 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 4 శాతానికి పైగా పెరిగిన హెచ్సీఎల్ షేర్ విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. ఈరోజు కూడా మార్కెట్లు పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 221 పాయింట్లు లాభపడి 60,617కి చేరుకుంది. నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 18,056 వద్ద స్థిరపడింది.

దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నప్పటికీ ఇన్వెస్టర్లు ఆందోళన చెందడం లేదు... ఈ వేరియంట్ లో వైరల్ లోడ్ తక్కువగా ఉంటుందని, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగా ఉంటుందని వారు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు మార్కెట్లు లాభపడ్డాయి. ఇక ఐటీ షేర్లు ఈనాటి లాభాలను ముందుండి నడిపించాయి.
 
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (4.30%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (1.74%), టెక్ మహీంద్రా (1.58%), టీసీఎస్ (0.99%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (0.71%).

టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-3.32%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.89%), ఐటీసీ (-0.65%), కోటక్ బ్యాంక్ (-0.51%), డాక్టర్ రెడ్డీస్ (-0.49%).

  • Loading...

More Telugu News