Telangana: తెలంగాణలో మరో 1,825 కొవిడ్ పాజిటివ్ కేసులు

Telangana corona report

  • గత 24 గంటల్లో 70,697 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 1,042 కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 14,995 మందికి చికిత్స

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 70,697 కరోనా శాంపిల్స్ పరీక్షించగా... 1,825 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,042 కొత్త కేసులు వెల్లడయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 201, రంగారెడ్డి జిల్లాలో 147 కేసులను గుర్తించారు. అదే సమయంలో 351 మంది ఆరోగ్యవంతులు కాగా, ఒకరు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 6,95,855 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,76,817 మంది ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 14,995కి పెరిగింది. అటు, కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,043కి పెరిగింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News