Tenth Class: ఈ ఏడాది టెన్త్ పరీక్షలు కచ్చితంగా నిర్వహిస్తాం: మంత్రి ఆదిమూలపు సురేశ్

Tenth class exams will be held in March

  • గతేడాది కరోనా ప్రభావంతో టెన్త్ పరీక్షలు రద్దు
  • వినుకొండలో మీడియాతో మాట్లాడిన ఆదిమూలపు
  • మార్చిలో పదో తరగతి పరీక్షలు
  • 7 సబ్జెక్టులతో పరీక్షలు ఉంటాయని వెల్లడి

కరోనా సంక్షోభం కారణంగా గతేడాది టెన్త్ పరీక్షలు నిర్వహించలేకపోయిన ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ పబ్లిక్ పరీక్షలు జరపాలన్న కృతనిశ్చయంతో ఉంది. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వినుకొండలో మాట్లాడుతూ, మార్చిలో పదో తరగతి పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. సంక్రాంతి కల్లా సిలబస్ పూర్తిచేయాలని విద్యాసంస్థలకు నిర్దేశించారు. ఈసారి 7 సబ్జెక్టులతో పరీక్షలు ఉంటాయని వివరించారు.

ఇక 'అమ్మఒడి' మూడో విడత గురించి చెబుతూ, విద్యాసంవత్సరం ఆరంభంలో ఇస్తామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా సంక్షేమ పథకాల అమలుకు వెనుకంజ వేయడంలేదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News