‘ఆర్ఆర్ఆర్’కు మరో ఆటంకం... విడుదల ఆపాలంటూ హైకోర్టులో మహిళ పిల్!
- అల్లూరి, కొమురం భీమ్ లను అవమానించేలా సినిమా తీశారని పిల్
- చరిత్రను వక్రీకరించేలా తెరకెక్కించారని అభ్యంతరం
- సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దని కోర్టుకు విన్నపం
మరోవైపు ఈ సినిమాకు తాజాగా మరో షాక్ తగిలింది. ఈ సినిమా విడుదలను ఆపాలంటూ తెలంగాణ హైకోర్టులో పిల్ (ప్రజా ప్రయోజన వ్యాజ్యం) దాఖలయింది. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా సత్యవరపు ఉండ్రాజవరంకు చెందిన అల్లూరి సౌమ్య అనే మహిళ ఈ పిల్ వేశారు. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ లను అవమానించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని తన పిటిషన్ లో ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఆ వీరుల అభిమానుల మనోభావాలను దెబ్బతీసేలా చిత్రాన్ని రూపొందించారని ఆరోపించారు. నిజమైన వీరుల చరిత్రను వక్రీకరించేలా సినిమాను తీశారని కోర్టుకు తెలిపారు. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దని కోరారు. సినిమా విడుదలపై స్టే ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్ ను హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది.