Andhra Pradesh: ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!

Andhra Pradesh registers 334 Corona cases in 24 hours

  • గత 24 గంటల్లో 334 కరోనా కేసుల నమోదు
  • విశాఖ జిల్లాలో 50 కేసుల నమోదు
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,516

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 334 కరోనా కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో అత్యధికంగా 50 కేసులు నమోదు కాగా... కడప, విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో అత్యల్పంగా 4 కేసుల వంతున నమోదయ్యాయి.

ఇదే సమయంలో 95 మంది కరోనా నుంచి కోలుకున్నారు. నెల్లూరు జిల్లాలో ఒకరు మృతి చెందారు. తాజా కేసులతో కలిపి ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,77,942కి చేరుకున్నాయి. ఇప్పటి వరకు 20,61,927 మంది కరోనా నుంచి కోలుకోగా... 14,499 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,516 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

  • Loading...

More Telugu News