Team India: రెండో టెస్టులో ముగిసిన తొలిరోజు ఆట... దక్షిణాఫ్రికా 35-1

Stumps at day one in second test

  • జోహాన్నెస్ బర్గ్ లో టెస్టు మ్యాచ్
  • టాస్ గెలిచిన టీమిండియా
  • తొలి ఇన్నింగ్స్ లో 202 ఆలౌట్
  • కేఎల్ రాహుల్ ఫిఫ్టీ.. అశ్విన్ 46 పరుగులు 
  • ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన సఫారీలు

టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో తొలిరోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్ లో 1 వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ డీన్ ఎల్గార్ (11 బ్యాటింగ్), కీగాన్ పీటర్సన్ (14 బ్యాటింగ్) ఉన్నారు. ఓపెనర్ మార్క్ క్రమ్ (7)ను మహ్మద్ షమీ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు సఫారీలు ఇంకా 167 పరుగులు వెనుకబడి ఉన్నారు.

అంతకుముందు, టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. పేస్ కు అనుకూలిస్తున్న పిచ్ పై బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బందిపడింది. దాంతో తొలి ఇన్నింగ్స్ లో 202 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ 50, అశ్విన్ 46, మయాంక్ అగర్వాల్ 26, హనుమ విహారి 20 పరుగులు చేశారు.

Team India
South Africa
First Day
Second Test
Johannesburg
  • Loading...

More Telugu News