arvind: కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్య‌లు.. బీజేపీ ఎంపీ అర్వింద్‌పై కేసు న‌మోదు

case against arvind

  • బంజారాహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో న‌మోదు
  • గ‌త ఏడాది నవంబరు 8న అర్వింద్ వ్యాఖ్య‌లు
  • బోయిన్‌పల్లికి చెందిన వ్యాపారి ఫిర్యాదు

బీజేపీ తెలంగాణ‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై హైద‌రాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు నమోదయింది. సీఎం కేసీఆర్‌పై అర్వింద్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఈ కేసు న‌మోదు చేశారు. ఐపీసీ 504, 55(2), 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన‌ట్లు పోలీసులు వివ‌రించారు.

గ‌త ఏడాది నవంబరు 8న నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో కేసీఆర్‌పై ఆయ‌న అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బోయిన్‌పల్లికి చెందిన వ్యాపారి కల్యాణ్‌ సందీప్‌ ఫిర్యాదు చేశారని, ఈ మేరకే తాము కేసు నమోదు చేశామ‌ని పోలీసులు చెప్పారు.

  • Loading...

More Telugu News