Andhra Pradesh: ఏపీలో కొత్తగా 176 కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!

Andhara Pradesh Corona updates

  • విశాఖ జిల్లాలో అత్యధికంగా 40 కేసుల నమోదు
  • కరోనా నుంచి కోలుకున్న 103 మంది
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,227

ఏపీలో గత 24 గంటల్లో 176 కరోనా కేసులు నమోదయ్యాయి. విశాఖపట్టణం జిల్లాలో అత్యధికంగా 40 కేసులు నమోదు కాగా, కడప జిల్లాలో అత్యల్పంగా ఒక్క కేసు నమోదయింది. గత 24 గంటల్లో ఒక్క కరోనా మరణం కూడా సంభవించకపోవడం గమనార్హం.

ఇక ఇదే సమయంలో 103 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,74,426కి చేరుకుంది. వీరిలో 20,58,704 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 14,495 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,227 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

  • Loading...

More Telugu News