Telangana: తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు... పూర్తి వివరాలు ఇవిగో!

Telangana corona bulletin

  • రాష్ట్రంలో 36,759 కరోనా పరీక్షలు 
  • 311 కొత్త కేసుల నమోదు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 198 మందికి కరోనా
  • ఇద్దరి మృతి.. 3,650 మందికి చికిత్స

తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. గడచిన ఒక్కరోజు వ్యవధిలో 36,759 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 311 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 198 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 32, రంగారెడ్డి జిల్లాలో 28 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 222 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,81,898 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,74,221 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,650 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,027కి పెరిగింది.

Telangana
Corona Virus
Media Bulletin
Today Cases
  • Loading...

More Telugu News