Sensex: స్వల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in losses

  • 12 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 9 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • 3 శాతానికి పైగా లాభపడ్డ ఎన్టీపీసీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ముగుస్తున్న నేపథ్యంలో మార్కెట్లు ఒడిదుడుకులకు గురయ్యాయి. దీంతో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 12 పాయింట్లు కోల్పోయి 57,794కి పడిపోయింది. నిఫ్టీ 9 పాయింట్లు నష్టపోయి 17,203 వద్ద స్థిరపడింది.
 
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (3.13%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.94%), టైటాన్ (1.85%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.74%), విప్రో (1.52%).

టాప్ లూజర్స్:
రిలయన్స్ (-1.94%), టాటా స్టీల్ (-1.34%), మారుతి సుజుకి (-0.82%), బజాజ్ ఫైనాన్స్ (-0.63%), సన్ ఫార్మా (-0.61%).

  • Loading...

More Telugu News