Revanth Reddy: ఆ బాధ్యత గాంధేయవాదులపై ఉంది: రేవంత్ రెడ్డి

Revanth Reddy fires on Modi and KCR

  • దేశానికి మోదీ, తెలంగాణకు కేసీఆర్ ప్రమాదకరం
  • మతం పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోంది
  • సోనియా నాయకత్వంలోనే దేశానికి రక్షణ

ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ లపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. దేశానికి మోదీ, తెలంగాణకు కేసీఆర్ చాలా ప్రమాదకరమని చెప్పారు. మతం పేరుతో బీజేపీ రాజకీయం చేస్తుందని... చిల్లర రాజకీయాలతో కాంగ్రెస్ పార్టీని కదిలించలేరని అన్నారు.

దేశానికి మంచి రోజులు రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పారు. సోనియాగాంధీ నాయకత్వంలోనే దేశానికి రక్షణ కలుగుతుందని అన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే పార్టీలను తరిమికొట్టాల్సిన బాధ్యత గాంధేయవాదులపై ఉందని చెప్పారు.

  • Loading...

More Telugu News