Telangana: తెలంగాణలో మరో 172 మందికి కరోనా పాజిటివ్

Telangana corona report

  • గత 24 గంటల్లో 39,919 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 86 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 3,625 మందికి చికిత్స

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 39,919 కరోనా పరీక్షలు నిర్వహించగా, 172 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 86 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 20 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 188 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 6,79,892 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,72,251 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,625 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,016కి పెరిగింది.

Telangana
Corona Virus
Daily Report
Today Cases
  • Loading...

More Telugu News