YSRCP: ఈ భావోద్వేగ నినాదాన్ని మ‌రోసారి ప‌ల‌కాలి: నాదెండ్ల మ‌నోహ‌ర్

Nadendla Manohar slams ycp

  • విశాఖ ఉక్కు ఆంధ్రుల హ‌క్కు
  • వైసీపీ నేత‌లు పోరాడాలి
  • పార్ల‌మెంటు వ‌ద్ద ప్లకార్డులు ప్ర‌ద‌ర్శించాలి
  • వైసీపీ ఎంపీల‌పై ఇప్పుడు మ‌రింత బాధ్య‌త‌

విశాఖ‌ప‌ట్నం ఉక్కు ప‌రిశ్ర‌మ ప‌రిర‌క్ష‌ణ బాధ్య‌త వైసీపీ ఎంపీల‌పై ఇప్పుడు మ‌రింత ఎక్కువైంద‌ని జ‌న‌సేన నేత నాదెండ్ల మ‌నోహ‌ర్ అన్నారు. ప్ర‌స్తుతం కొన‌సాగుతోన్న పార్ల‌మెంటు స‌మావేశాల్లో వైసీపీ ఎంపీలు విశాఖ ఉక్కు ప‌రిశ్రమ గురించి మాట్లాడాల‌ని, దాన్ని ప‌రిర‌క్షించేలా కృషి చేయాల‌ని ఆయ‌న కోరారు.

పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో ప్ల‌కార్డులు ప‌ట్టుకుని విశాఖ స్టీల్ ప్లాంటును కాపాడుకునేలా పోరాటం చేయాల‌ని ఆయ‌న అన్నారు. గ‌తంలో విశాఖ ఉక్కు ప్లాంట్ కోసం ఎంతో మంది త్యాగాలు చేసి ఏ విధంగా పోరాడారో అదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాల‌ని నాదెండ్ల మ‌నోహ‌ర్ సూచించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హ‌క్కు అనే భావోద్వేగ నినాదాన్ని మ‌రోసారి ప‌ల‌కాల‌ని ఆయ‌న చెప్పారు.  

         

  • Loading...

More Telugu News