Pakistan: పాకిస్థాన్ లో భారీ పేలుడుకు పాల్పడిన ఉగ్రవాదులు.. దద్దరిల్లిన కరాచీ!

Bomb blast in Pakistan Karachi

  • కరాచీలో ఓ భవనంలో భారీ పేలుడు
  • 10 మంది దుర్మరణం
  • పెద్ద సంఖ్యలో గాయపడిన జనాలు

ఉగ్రదాడితో పాకిస్థాన్ ఆర్థిక రాజధాని కరాచీ దద్దరిల్లింది. నగరంలో నిత్యం రద్దీగా ఉండే షేర్షా పరాచా చౌక్ లోని ఓ భవనంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 10 మంది దుర్మరణంపాలయ్యారు. పలు భవనాలు ధ్వంసమయ్యాయి. పెద్ద సంఖ్యలో జనాలు గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. ఇది ఉగ్రవాదుల పనేనని పాక్ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది. అయితే, ఇంతవరకు ఏ ఉగ్ర సంస్థ ఈ పేలుడుకు పాల్పడింది తామేనని ప్రకటించుకోలేదు. మరోవైపు కరాచీలో హైఅలర్ట్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News