Delhi: పంజా విసురుతోంది.. ఢిల్లీలో ఒక్కరోజే భారీగా ఒమిక్రాన్ కేసులు

10 Omicron cases registers in Delhi in a single day

  • ఢిల్లీలో ఒక్కరోజే 10 ఒమిక్రాన్ కేసుల నమోదు
  • నిన్న ఢిల్లీలో వెలుగులోకి 85 కరోనా కేసులు 
  • డిసెంబర్ 5న ఇండియాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు

వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నట్టే చాపకింద నీరులా ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తోంది. మన దేశంలో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ కేసులు సెంచరీకి చేరువలో ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కేవలం ఒకే రోజులో 10 కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. నాలుగు నెలల తర్వాత ఢిల్లీలో నిన్న కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. నిన్న ఒక్కరోజే 85 కేసులు నమోదయ్యాయి.

డిసెంబర్ 5న ఇండియాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఇప్పటి వరకు దేశ రాజధానిలో 20 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీరితో పది మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేందర్ జైన్ మాట్లాడుతూ, విదేశాల నుంచి వచ్చిన వారిలో చాలా మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు.

ఒమిక్రాన్ విషయానికి వస్తే... ఎక్కువ కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. ఇప్పటి వరకు దాదాపు 32 కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ కేసులు నమోదైన రాష్ట్రాల్లో కర్ణాటక, గుజరాత్, కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఏపీ, తెలంగాణలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News