Sensex: ఒమిక్రాన్ భయాలతో నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in losses

  • 166 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 43 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • 2.73 శాతం నష్టపోయిన ఐటీసీ షేర్ విలువ

అంతర్జాతీయంగా, దేశీయంగా పెరుగుతున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులు మన మార్కెట్లపై ప్రభావాన్ని చూపుతున్నాయి. ఒమిక్రాన్ భయాలతో ఈరోజు మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే ఒరవడిని కొనసాగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 166 పాయింట్లు నష్టపోయి 58,117కి పడిపోయింది. నిఫ్టీ 43 పాయింట్లు కోల్పోయి 17,324 వద్ద స్థిరపడింది.
 
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (3.84%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (1.05%), నెస్లే ఇండియా (1.03%), యాక్సిస్ బ్యాంక్ (0.94%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.65%).

టాప్ లూజర్స్:
ఐటీసీ (-2.73%), బజాజ్ ఫైనాన్స్ (-2.10%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-1.75%), భారతి ఎయిర్ టెల్ (-1.60%), రిలయన్స్ (-1.22%).

  • Loading...

More Telugu News