Corona Virus: దేశంలో భారీగా త‌గ్గిన రోజూవారీ క‌రోనా కేసులు

corona bulletin in inida

  • కొత్త‌గా  5,784 క‌రోనా కేసులు
  • నిన్న‌ 252 మంది మృతి
  • మృతుల సంఖ్య మొత్తం 4,75,888
  • 133.8 కోట్ల డోసుల వ్యాక్సిన్ వినియోగం

దేశంలో కొత్త‌ క‌రోనా కేసుల సంఖ్య భారీగా త‌గ్గింది. దేశంలో నిన్న కొత్త‌గా 5,784 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ రోజు ఉద‌యం బులెటిన్‌లో ప్ర‌క‌టించింది. అలాగే, నిన్న క‌రోనా నుంచి 7,995 మంది కోలుకున్నారు, క‌రోనా వ‌ల్ల నిన్న‌ 252 మంది ప్రాణాలు కోల్పోయారు.  

దేశ వ్యాప్తంగా హోం క్వారంటైన్లు, ఆసుప‌త్రుల్లో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య‌ 88,993గా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా నుంచి మొత్తం 3,41,38,763 మంది కోలుకున్నారు. క‌రోనా మృతుల సంఖ్య 4,75,888కి పెరిగింది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 133.8 కోట్ల డోసుల వ్యాక్సిన్ వినియోగించారు.

  • Loading...

More Telugu News