Telangana: తెలంగాణలో కొత్తగా 188 కరోనా కేసులు

Telangana latest corona report

  • గత 24 గంటల్లో 35,978 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 78 కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 3,891 మందికి చికిత్స

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 35,978 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 188 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 78 కొత్త కేసులు నమోదు కాగా, హన్మకొండ జిల్లాలో 21, కరీంనగర్ జిల్లాలో 15 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 193 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,78,142 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,70,246 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,891 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 4,005కి పెరిగింది.

Telangana
Corona
Report
Today Cases
  • Loading...

More Telugu News