Omicron: భారత్ లో ఒమిక్రాన్ ప్రవేశించింది: కేంద్ర ప్రభుత్వం

Omicron cases found in India

  • ఇండియాలో రెండు ఒమిక్రాన్ కేసుల గుర్తింపు
  • రెండు కేసులూ కర్ణాటకలోనే గుర్తింపు
  • 44, 66 ఏళ్ల వ్యక్తుల్లో గుర్తింపు

కరోనా కొత్త మ్యుటేషన్ ఒమిక్రాన్ భారత్ లో అడుగుపెట్టింది. దక్షిణాఫ్రికాలో తొలుత వెలుగు చూసిన ఈ వేరియంట్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వేరియంట్ కేసులు ఇండియాలో సైతం వెలుగుచూశాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మన దేశంలో రెండు కేసులను గుర్తించినట్టు తెలిపింది. ఈ రెండు కేసులను కర్ణాటకలోనే గుర్తించినట్టు పేర్కొంది. 44 ఏళ్లు, 66 ఏళ్ల ఇద్దరు వ్యక్తుల్లో ఈ వేరియంట్ ను గుర్తించనట్టు తెలిపింది.

  • Loading...

More Telugu News