Corona Virus: ఏపీలో మరో 184 మందికి కరోనా పాజిటివ్

Corona positive for another 184 in AP

  • గత 24 గంటల్లో 25,925 కరోనా పరీక్షలు
  • కృష్ణా జిల్లాలో 34 మందికి పాజిటివ్
  • రాష్ట్రంలో ముగ్గురి మృతి 
  • ఇంకా 2,149 మందికి చికిత్స 

ఏపీలో గడచిన 24 గంటల్లో 25,925 కరోనా పరీక్షలు నిర్వహించగా, 184 మందికి పాజిటివ్ అని తేలింది. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 34 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 30, విశాఖపట్నం జిల్లాలో 26, పశ్చిమ గోదావరి జిల్లాలో 21, తూర్పు గోదావరి జిల్లాలో 17, గుంటూరు జిల్లాలో 15 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 1 కేసు నమోదయింది.

అదే సమయంలో 134 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,72,909 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 20,56,318 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,149 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,442కి పెరిగింది.

  • Loading...

More Telugu News