Sensex: మార్కెట్లకు ఈరోజు కూడా నష్టాలే!

Markets ends in losses

  • 314 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 100 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 1.95 శాతం నష్టపోయిన ఏసియన్ బ్యాంక్ షేర్ వాల్యూ

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాలను మూటకట్టుకున్నాయి. రేపు ఆప్షన్స్ ట్రేడింగ్ ముగియనున్న నేపథ్యంలో ట్రేడింగ్ చివరి సమయంలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 314 పాయింట్లు నష్టపోయి 60,008కి పడిపోయింది. నిఫ్టీ 100 పాయింట్లు కోల్పోయి 17,898 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మారుతి సుజుకి (2.77%), ఏసియన్ పెయింట్స్ (2.47%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (2.08%), ఐటీసీ (1.68%), ఎన్టీపీసీ (1.68%).

టాప్ లూజర్స్:
ఏసియన్ బ్యాంక్ (-1.95%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.91%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-1.51%), భారతి ఎయిర్ టెల్ (-1.39%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-1.19%).

  • Loading...

More Telugu News