Maharashtra: మైనర్ పై ఆరు నెలలుగా 400 మంది అత్యాచారం

Minor Gang Raped By 400 In Maharashtra Ambejogai

  • కేసు పెట్టేందుకు వెళ్తే పోలీసూ అఘాయిత్యం
  • మహారాష్ట్రలోని అంబజోగైలో దారుణ ఘటన
  • బాలిక  ఐదు నెలల గర్భిణీ
  • అబార్షన్ చేయించేందుకు శిశు సంక్షేమ కమిటీ ప్రయత్నాలు

ఆ అమ్మాయి మైనర్. బాల్య వివాహంతో అప్పటికే ఒకసారి ఘోరమైన అన్యాయాన్ని ఎదుర్కొంది. తర్వాత జాబ్ పేరుతో ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. 400 మంది రాబందుల చేతుల్లో బలైంది. గ్యాంగ్ రేప్ కు గురై న్యాయం కోసం స్టేషన్ మెట్లెక్కితే.. కాపాడాల్సిన పోలీసే కామాంధుడై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆరు నెలలుగా ఆ అమ్మాయిపై సాగిన ఈ ఘోరకలి మహారాష్ట్రలో సంచలనం సృష్టించింది.

ఈ దారుణ ఘటన బీద్ జిల్లాలోని అంబజోగైలో చోటు చేసుకుంది. ఆమె ఇప్పుడు ఐదు నెలల గర్భిణీ. ఈ దారుణంతో కుంగుబాటుకు లోనైన ఆ అమ్మాయికి గర్భవిచ్ఛిత్తి చేసేందుకు శిశు సంక్షేమ కమిటీ ప్రక్రియను మొదలుపెట్టింది. ఈ ఘటనకు సంబంధించి 9 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు.

ఆ అమ్మాయి కుటుంబం కూలీనాలి చేసుకుంటూ పొట్ట నింపుకునేది. రెండేళ్ల క్రితం ఆమె తల్లి చనిపోవడంతో.. తండ్రి వివాహం చేశాడు. ఏడాదిన్నర పాటు అత్తారింట్లోనే ఉన్న ఆమె.. మామ వేధింపులు భరించలేక పుట్టింటికి తిరిగొచ్చింది. ఈ క్రమంలోనే అంబజోగైలో ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అక్కడ ఓ అకాడమీలో ఇద్దరు వ్యక్తులను కలిసింది. జాబ్ ఇప్పిస్తామని నమ్మించి.. ఆ ఇద్దరు ఆమెపై అత్యాచారం చేశారు.

ఆ తర్వాత ఆరు నెలల పాటు 400 మందికిపైగా బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. వారిపై కేసు పెట్టేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బాలికకు.. అక్కడా అన్యాయమే జరిగింది. కేసు బుక్ చేయాల్సిన పోలీసే.. లాడ్జ్ కు తీసుకెళ్లి రేప్ చేశాడు. తాజాగా శిశు సంక్షేమ కమిటీ చొరవతో బీద్ జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు.

  • Loading...

More Telugu News