Telangana: తెలంగాణలో కొత్తగా 153 కరోనా కేసులు నమోదు

Telangana covid status report

  • గత 24 గంటల్లో 36,510 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 52 మందికి పాజిటివ్
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 3,737 మందికి చికిత్స

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 36,510 కరోనా పరీక్షలు నిర్వహించగా, 153 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 52 కొత్త కేసులు నమోదు కాగా, నల్గొండ జిల్లాలో 14, కరీంనగర్ జిల్లాలో 12, రంగారెడ్డి జిల్లాలో 11 కేసులు వెల్లడయ్యాయి. వికారాబాద్, నారాయణపేట, మెదక్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్ జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.

అదే సమయంలో 160 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,73,140 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,65,432 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,737 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,971కి పెరిగింది.

Telangana
COVID19
Status
Media Report
Today Cases
  • Loading...

More Telugu News