Telangana: తెలంగాణలో కొత్తగా 164 కరోనా కేసుల నమోదు

Telanga registers 164 new Corona cases
  • జీహెచ్ఎంసీ పరిధిలో 55 కేసుల నిర్ధారణ
  • కరోనా నుంచి కోలుకున్న 171 మంది
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,746
తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 164 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 55 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదే సమయంలో 171 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.85 శాతంగా ఉంది.

మరోవైపు కరోనా వల్ల ఒక వ్యక్తి మృతి చెందారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,72,987కి చేరుకుంది. మొత్తం 6,65,272 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 3,969 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,746 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.

Telangana
Corona Virus
Updates

More Telugu News