Sensex: ద్రవ్యోల్బణం భయాలు.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in losses

  • 80 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 27 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 3 శాతానికి పైగా నష్టపోయిన ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్ విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా నష్టాలను మూటకట్టుకున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. దీని ప్రభావం మెటల్స్, బ్యాంక్ స్టాక్స్ పై పడింది. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 80 పాయింట్లు నష్టపోయి 60,352కి పడిపోయింది. నిఫ్టీ 27 పాయింట్లు కోల్పోయి 18,017 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (3.16%), మహీంద్రా అండ్ మహీంద్రా (3.00%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.16%), సన్ ఫార్మా (1.14%), ఐటీసీ (0.90%).

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.38%), టాటా స్టీల్ (-2.77%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.23%), ఏసియన్ పెయింట్స్ (-1.14%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.13%).

  • Loading...

More Telugu News