Sensex: భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in losses

  • 478 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
  • 152 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 10 శాతానికి పైగా నష్టపోయిన ఇండస్ ఇండ్ బ్యాంక్

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో సెషన్ ను లాభాలతో ముగించాయి. ఈరోజు మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 478 పాయింట్లు లాభపడి 60,545కి చేరుకుంది. నిఫ్టీ 152 పాయింట్లు పెరిగి 18,069 వద్ద స్థిరపడింది.
 
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టైటాన్ కంపెనీ (4.54%), అల్ట్రాటెక్ సిమెంట్ (4.20%), బజాజ్ ఫిన్ సర్వ్ (3.98%), టెక్ మహీంద్రా (3.81%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (3.36%).

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-10.71%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.48%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.38%), మారుతి సుజుకి (-0.67%), ఏసియన్ పెయింట్స్ (-0.66%).

  • Loading...

More Telugu News