Andhra Pradesh: పర్యాటకులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. బోటు షికారుకు గ్రీన్ సిగ్నల్!

APTDC said Good news to Tourists

  • కరోనాతో ఆగిపోయిన బోటు ప్రయాణాలు
  • పాపికొండలు, భవానీద్వీపం, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో తిరిగి బోటు షికారు
  • ఏర్పాట్లు చేయాలని ఏపీటీడీసీ ఆదేశం
  • ఏడో తేదీ నుంచి అందుబాటులోకి

పర్యాటకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నదుల్లో బోటు షికారుకు అనుమతులు మంజూరు చేసింది. ఈ నెల ఏడో తేదీ నుంచి పాపికొండలు, భవానీద్వీపం, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో బోట్లు నడపనున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) డైరెక్టర్ ఎస్.సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. కరోనా నేపథ్యంలో మూతబడిన పర్యాటకం తిరిగి తెరుచుకుంటుండడంపై పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, బోట్లపై నియంత్రణ, పర్యవేక్షణ కోసం 9 చోట్ల ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్లు సమర్థంగా పనిచేసేలా రెవెన్యూ, పోలీస్, విపత్తుశాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. అలాగే, హోటళ్లు, రిసార్టులు, ఇతర సందర్శనీయ ప్రాంతాల్లో అవసరమైన సదుపాయాలు కల్పించాలని కూడా సత్యనారాయణ ఆదేశించారు.

Andhra Pradesh
Tourism
APTDC
Papikondalu
Bhavani Island
Boat Journey
  • Loading...

More Telugu News