Telangana: తెలంగాణలో కొత్తగా 167 మందికి కరోనా పాజిటివ్

Telangana corona news bulletin

  • గత 24 గంటల్లో 37,941 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 66 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 3,933 మందికి చికిత్స

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 37,941 కరోనా పరీక్షలు నిర్వహించగా, 167 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 66 కొత్త కేసులు నమోదయ్యాయి. వనపర్తి, నిర్మల్, నారాయణపేట, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 207 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,71,790 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,63,898 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,933 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,959కి పెరిగింది.

Telangana
Corona Virus
News
Bulletin
Today Cases
  • Loading...

More Telugu News