Andhra Pradesh: ఏపీలో కొత్తగా మరో 259 కరోనా కేసులు

AP registers 259 new Corona cases in last 24 hours

  • చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 48 కేసుల నమోదు
  • రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురి మృతి
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,042

ఏపీలో గత 24 గంటల్లో 33,437 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా 259 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 48 కేసులు నమోదు కాగా... కర్నూలు జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇదే సమయంలో ఐదుగురు కరోనా కారణంగా మృతి చెందారు. 354 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. తాజా కేసులతో కలిపి ఏపీలో ఇప్పటి వరకు 20,66,929 కేసులు నమోదు కాగా... 20,48,505 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 14,382 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,042 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

  • Loading...

More Telugu News