Telangana: తెలంగాణలో మరో 186 మందికి కరోనా పాజిటివ్

Telangana covid media report

  • గత 24 గంటల్లో 41,392 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 65 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 4,164 మందికి చికిత్స

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 41,392 కరోనా పరీక్షలు నిర్వహించగా, 186 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 65 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 16, ఖమ్మం జిల్లాలో 11 కేసులు వెల్లడయ్యాయి. మెదక్, కొమరంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 122 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 6,70,829 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,62,714 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,164 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,951కి పెరిగింది.

Telangana
Corona Virus
Media Report
Today Cases
  • Loading...

More Telugu News