Andhra Pradesh: ఏపీలో కొత్తగా 295 మందికి కరోనా పాజిటివ్

AP Covid Daily Report

  • గత 24 గంటల్లో 27,641 కరోనా పరీక్షలు
  • తూర్పుగోదావరి జిల్లాలో 69 కేసులు
  • రాష్ట్రంలో ఏడుగురి మృతి
  • ఇంకా 4,830 మందికి చికిత్స

ఏపీలో గడచిన 24 గంటల్లో 27,641 కరోనా పరీక్షలు నిర్వహించగా 295 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 69 కొత్త కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 68, చిత్తూరు జిల్లాలో 40 కేసులు వెల్లడయ్యాయి. విజయనగరం, అనంతపురం జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 560 మంది కరోనా నుంచి కోలుకోగా, ఏడుగురు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 20,63,872 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,44,692 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,830 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,350కి పెరిగింది.

Andhra Pradesh
COVID19
Daily Report
Today Cases
Media Bulletin
  • Loading...

More Telugu News