Telangana: తెలంగాణలో కొత్తగా 207 మందికి కొవిడ్ పాజిటివ్

Telangana covid daily bulletin

  • గత 24 గంటల్లో 42,108 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 38 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 3,984 మందికి చికిత్స

తెలంగాణలో కొవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 42,108 కరోనా పరీక్షలు నిర్వహించగా, 207 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. గ్రేటర్ హైదరాబాదు పరిధిలో 38 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 22, రంగారెడ్డి జిల్లాలో 17, ఖమ్మం జిల్లాలో 15 కేసులు గుర్తించారు. వనపర్తి, నిర్మల్, నారాయణపేట, కొమరంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 184 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,70,139 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,62,209 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,984 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,946కి పెరిగింది.

Telangana
COVID19
Daily Bulletin
Media Report
  • Loading...

More Telugu News