Telangana: తెలంగాణలో మరో 193 కరోనా కేసుల వెల్లడి

Telangana corona details

  • గత 24 గంటల్లో 42,367 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 64 మందికి పాజిటివ్
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 3,963 మందికి చికిత్స

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 42,367 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 193 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 64 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 20, రంగారెడ్డి జిల్లాలో 14, ఖమ్మం జిల్లాలో 14 కేసులు గుర్తించారు. వికారాబాద్, నారాయణపేట, కొమరంభీం ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 196 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,69,932 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,62,025 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,963 మందికి చికిత్స జరుగుతోంది. కరోనా మృతుల సంఖ్య 3,944కి పెరిగింది.

Telangana
Corona Virus
Update
Daily Cases
  • Loading...

More Telugu News