Crime News: త‌న పోలిక‌ల‌తో పుట్ట‌లేద‌ని.. పాప‌ను చంపి చెరువులో ప‌డేసిన తండ్రి

  • అనంత‌పురం జిల్లాలోని క‌ల్యాణ‌దుర్గంలో ఘ‌ట‌న‌
  • రెండు నెల‌ల క్రితం  పాప‌కు జ‌న్మ‌నిచ్చిన మ‌ల్లికార్జున భార్య‌
  • అనుమానాలు వ్య‌క్తం చేసిన మ‌ల్లికార్జున‌
  • పాప‌ను చంపి బెంగ‌ళూరు పారిపోయిన వైనం

త‌న పోలిక‌ల‌తో పుట్ట‌లేద‌ని కూతురిని చంపి చెరువులో ప‌డేశాడో తండ్రి. ఈ అమానుష ఘ‌ట‌న అనంత‌పురం జిల్లాలోని క‌ల్యాణ‌దుర్గంలో చోటు చేసుకుంది. మ‌ల్లికార్జున అనే వ్య‌క్తి త‌న భార్య‌తో క‌లిసి క‌ల్యాణ దుర్గంలో ఉండేవాడు.

అత‌డి భార్య రెండు నెల‌ల క్రితం ఓ పాప‌కు జ‌న్మ‌నిచ్చింది. అయితే, భార్య‌పై అనుమానాలు వ్య‌క్తం చేస్తోన్న మ‌ల్లికార్జున.. ఆ పాప త‌న పోలికల‌తో ఎందుకు పుట్ట‌లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసేవాడు. ఆ క్ర‌మంలో నిన్న‌ పాప‌ను తీసుకుని ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లాడు. అత‌డు తిరిగి ఇంటికి రాక‌పోవ‌డంతో కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని, నిన్న‌టి నుంచి తండ్రి, పాప‌కోసం వెతుకుతున్నారు.

ఈ రోజు ఆ పాప స్థానిక చెరువులో విగ‌త‌జీవిగా క‌న‌ప‌డింది. మ‌రోవైపు, ఆ పాప తండ్రి బెంగ‌ళూరు పారిపోయాడు. అయితే, అత‌డు అక్క‌డి నుంచి స్వ‌యంగా పోలీసుల‌కు ఫోను చేసి తానే పాప‌ను చంపాన‌ని చెప్పాడు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి స‌మాచారం అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News