KTR: కేటీఆర్ మెడలో పసుపు కండువా వేసిన డీఎంకే ఎంపీలు!

DMK delegation met KTR at Telangana Bhavan

  • నీట్ రద్దు కోరుతున్న తమిళనాడు ప్రభుత్వం
  • మద్దతు కూడగడుతున్న సీఎం స్టాలిన్
  • తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ
  • లేఖను మంత్రి కేటీఆర్ కు అందజేసిన డీఎంకే ఎంపీలు

తమిళనాడు అధికార పక్షం డీఎంకే పార్టీకి చెందిన ఎంపీలు నేడు తెలంగాణ మంత్రి కేటీఆర్ ను కలిశారు. జాతీయ స్థాయి వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ రద్దు కోరుతూ తమిళనాడు సీఎం స్టాలిన్ జాతీయస్థాయిలో మద్దతు కూడగడుతున్నారు. ఈ నేపథ్యంలో, ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులకు స్టాలిన్ లేఖలు రాస్తున్నారు.

ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి రాసిన లేఖతో డీఎంకే ఎంపీలు వీరస్వామి, ఎల్ఎం గోవింద్ నేడు తెలంగాణ భవన్ కు విచ్చేశారు. అక్కడున్న మంత్రి కేటీఆర్ ను కలిసి లేఖ అందజేశారు. నీట్ రద్దుకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా డీఎంకే ఎంపీలు కేటీఆర్ మెడలో పసుపు కండువా వేశారు. డీఎంకే పార్టీ కండువా కూడా పసుపు రంగులోనే ఉంటుందన్న సంగతి తెలిసిందే.

KTR
DMK MPs
Telangana Bhavan
Stalin
NEET
Tamilnadu
  • Loading...

More Telugu News