Blast: కాబూల్ లో మసీదు వద్ద భారీ పేలుడు... 14 మంది మృతి

Huge explosion at Kabul Eid Gah Mosque

  • ఆఫ్ఘనిస్థాన్ రాజధానిలో భారీ విస్ఫోటనం
  • ఈద్గా మసీదు వద్ద ఘటన
  • ఘటనను నిర్ధారించిన తాలిబన్లు
  • మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో ఓ మసీదు వద్ద భారీ విస్ఫోటనం సంభవించింది. ఈ ఘటనలో 14 మంది మరణించినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈద్గా మసీదు ప్రధాన ద్వారం వెలుపల జరిగిన ఈ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చని తెలుస్తోంది. పెద్దసంఖ్యలో గాయపడగా, వారిని అంబులెన్సుల ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఈ ధాడి ఘటనను తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

గతవారం జబీహుల్లా ముజాహిద్ తల్లి మరణించగా, ఆమె మరణానంతర ప్రార్థనలు మసీదులో నిర్వహిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది.

కాగా, అహ్మదుల్లా అనే దుకాణదారు ఈ పేలుడు ఘటనకు ప్రత్యక్షసాక్షిగా నిలిచాడు. ఈ పేలుడు ఘటనకు కొద్దిముందుగా తాలిబన్లు ఈ మసీదు రోడ్డును మూసివేసి జబీహుల్లా ముజాహిద్ తల్లి సంస్మరణ ప్రార్థనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారని అహ్మదుల్లా వివరించాడు. ఈద్గా మసీదు వద్ద భారీ శబ్దం వినిపించిందని, ఆపై తుపాకీ కాల్పుల మోత వినిపించిందని తెలిపాడు.

Blast
Kabul
Eid Gah Mosque
Zabihulla Muzahid
Taliban
Afghanistan
  • Loading...

More Telugu News