Pawan Kalyan: రాజ‌మండ్రి విమానాశ్ర‌యం చేరుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. భారీగా త‌ర‌లివ‌చ్చిన అభిమానులు

pawan  reaches ap

  • శ్ర‌మ‌దానం కార్య‌క్ర‌మంలో పాల్గొన‌ను‌న్న ప‌వ‌న్
  • రాజ‌మ‌హేంద్రవ‌రంలో పోలీసుల ఆంక్ష‌లు
  • శ్ర‌మ‌దానం త‌ర్వాత బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడ‌నున్న ప‌వన్

శ్ర‌మ‌దానం కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డానికి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌మండ్రి విమానాశ్ర‌యానికి చేరుకున్నారు. ఆ ప్రాంతానికి ఆయ‌న అభిమానులు, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు భారీగా త‌ర‌లివ‌చ్చారు. రాజ‌మ‌హేంద్రవ‌రంలో పోలీసులు అడుగ‌డుగున ఆంక్ష‌లు విధించ‌డంతో తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది. అయిన‌ప్ప‌టికీ శ్ర‌మ‌దానంలో పాల్గొనాల‌ని ప‌వ‌న్ నిర్ణ‌యించారు.

హుకుంపేట‌-బాలాజీపేట ర‌హ‌దారిపై శ్ర‌మ‌దానం త‌ర్వాత బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన‌నున్నారు. అయితే, స‌భా ప్రాంగ‌ణానికి చేరుకున్న దారుల‌న్నింటినీ పోలీసులు మూసివేశారు. స‌భ‌కు అన్ని వైపులా 5 కిలోమీట‌ర్ల మేర ఆంక్ష‌లు విధించారు. అయితే, ప‌వ‌న్ క‌ల్యాణ్ నిర్వ‌హించాల‌నుకున్న స‌భ‌కు ఎలాంటి ఆటంకాలు ఉండ‌బోవ‌ని పోలీసులు చెప్ప‌డం గ‌మ‌నార్హం.

  • Loading...

More Telugu News