BJP: బీజేపీ నేతపై దాడి కేసులో మాజీ కాంగ్రెస్ ఎంపీపై కేసు నమోదు చేసిన పోలీసులు

Congress Ex MP booked in BJP leader attack case

  • బీజేపీ నేత సంగమ్ లాల్ గుప్తాపై దాడి
  • కాంగ్రెస్ మాజీ ఎంపీ ప్రమోద్ తివారీపై ఆరోపణలు
  • ప్రమోద్ సహా మొత్తం 26 మందిపై కేసు

బీజేపీ నేత సంగమ్ లాల్ గుప్తాపై దాడి చేసిన కేసులో కాంగ్రెస్ మాజీ నేతపై పోలీసులు ఫిర్యాదు నమోదు చేశారు. తనతోపాటు పార్టీ కార్యకర్తలపై కొందరు దాడి చేశారని సంగమ్ లాల్ ఆరోపించారు. ఈ ముఠాకు కాంగ్రెస్ మాజీ ఎంపీ ప్రమోద్ తివారి నాయకత్వం వహించారని సంగమ్ లాల్ తెలిపారు.

ఈ విషయంలో ఫిర్యాదు అందుకున్న పోలీసులు 26 మందిపై కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో తమ పార్టీ కార్యకర్తలతోపాటు తనపై కూడా కాంగ్రెస్ నేతలు దాడి చేశారని సంగమ్ లాల్ తెలిపారు.

ఈ విషయంలో తివారీతోపాటు ఆయన కుమార్తెపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఒక్క నిందితుడిని కూడా వదిలే ప్రసక్తి లేదని యూపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కేశవ్ ప్రసాద్ మౌర్య హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News