Telangana: తెలంగాణలో కొత్తగా 241 మందికి కరోనా

Telangana corona report

  • గత 24 గంటల్లో 52,943 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 68 కొత్త కేసులు
  • రాష్ట్రంలో రెండు కరోనా మరణాలు
  • ఇంకా 5,223 మందికి చికిత్స

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 52,943 కరోనా పరీక్షలు నిర్వహించగా, 241 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 68 కొత్త కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 23, నల్గొండ జిల్లాలో 16 కేసులు గుర్తించారు. నారాయణపేట, కొమరంభీం ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 298 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 6,63,026 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,53,901 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,223 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,902కి పెరిగింది.

Telangana
Corona Virus
Media Report
Today Cases
  • Loading...

More Telugu News